24/06/2024: Y7News Telugu
మంచిరోజులొస్తాయని, ఎవరూ భయపడొద్దని మాజీ సీఎం జగన్ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పులివెందులో తనను కలిసిన వైసీపీ శ్రేణులకు జగన్ ధైర్యం చెప్పారు. మళ్లీ ప్రజల్లోకి వస్తానని, అందరికీ ఉంటానని చెప్పారు. పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ నుంచి కాంట్రాక్టర్లకు రూ.100 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ ఉంటే తనకెందుకు చెప్పలేదంటూ సన్నిహితులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.