22/06/2024
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం మేధా హై స్కూల్ లో విద్యుత్ ఘాతానికి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అర్మాన్ అనే 9 సంవత్సరాల బాలుడు 5 వ తరగతి చదువుతున్నాడు. ఈ రోజు బాలుడు ఆవరణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని తల్లిదండ్రులు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. బాలుడు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బాలుడిని హైదరాబాద్ తరలించారు. స్కూల్ సిబ్బందిని వివరణ కోరగా బాలుడు స్కూల్ కి రావడం ఇష్టం లేక స్కూల్ నుండి గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని చెబుతున్నారు. ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలినట్లు చెబుతున్నారు. స్కూల్ కి చేరుకున్న విద్యార్థి నాయకుడు సాయి విద్యార్థులపై పాఠశాల వారికి ఉన్న అశ్రద్ధ వల్లే ఈ ఘటన జరిగిందని , ఈ పాఠశాలపై చర్యలు తీసుకుని గుర్తింపు ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.